- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని యాదవ్ వీధిలో వెలసిన వరసిద్ధి వినాయక దేవాలయ నిర్మాణానికి కీర్తిశేషులు గీరిబోయిన ప్రభంజన కుమార్ జ్ఞాపకార్థం సోదరుడు గిరి బోయిన కిషోర్ కుమార్, నీలిమాలు ఆలయ అభివృద్ధి కమిటీ వారికి రూ.2,00,116 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారి పేరిటన అర్చకులు ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా సత్కరించారు.


