Homeఆంధ్రప్రదేశ్దసరాకి ఆర్టీసీకి భారీ ఆదాయం.. రూ.2.49 కోట్లు

దసరాకి ఆర్టీసీకి భారీ ఆదాయం.. రూ.2.49 కోట్లు

- Advertisement -

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.
దసరా సెలవులు, అలాగే విజయవాడ దుర్గగుడి సందర్శకుల భారీ తరలింపు,మహిళలకు ప్రత్యేకంగా అమలు చేసినఁస్త్రీశక్తి పథకంఁకారణంగా బస్సు సర్వీసులపై ప్రయాణికుల స్పందన అసాధారణంగా పెరిగింది.వీటిలో మహిళా ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉన్నది,ఇది గడచిన ఏడాదితో పోలిస్తే స్పష్టంగా తేడా చూపిస్తుంది.
పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తరలింపు
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు దసరా పండుగ నేపథ్యంలో, ఉమ్మడి జిల్లా ఆర్టీసీ విధించిన క్రమంలో హైదరాబాద్,తిరుపతి,వైజాగ్, రాజమహేంద్రవరం వంటి ప్రధాన నగరాలకు మొత్తం 1,538 బస్సులు రూట్లకు కేటాయించబడ్డాయి.

ఈకాలంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆదాయంలో పెద్ద ఎత్తున వృద్ధి గమనించబడింది.గత ఏడాది ఉమ్మడి జిల్లాకు ఈ సమయంలో సుమారు రూ.1.9 కోట్ల ఆదాయం రాగా, ఈ సారి అది రూ.2.49 కోట్లకు చేరింది. అంటే, సుమారు రూ.59 లక్షల అదనపు ఆదాయం సృష్టించబడింది.ఎన్టీఆర్ జిల్లాలో 700 బస్సులు ఉండగా, మిగిలిన 655 బస్సులు ఇతర జిల్లాల నుంచి రప్పించారు.ఈ బస్సుల ద్వారా వచ్చిన ఆదాయం కూడా జోడిస్తే, మొత్తం ఆదాయం రూ.3 కోట్ల దాటినట్లు అంచనా వేయవచ్చు.గత ఏడాదిలో బస్సుల్లో సగటు ఆక్యుపెన్సీ 64 శాతం ఉండగా,ఈసారి అది 84శాతం వరకు పెరిగింది, అంటే 20 శాతం వృద్ధి.

పురుష-మహిళల తేడా 30:70
ఁస్త్రీశక్తి పథకంఁ అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి, గతంలో బస్సుల్లో 60:40 నిష్పత్తిలో ఉండే పురుష-మహిళల తేడా 30:70గా మారింది.అంటే, ప్రతి వంద మంది ప్రయాణికులలో 70మంది మహిళలు ఉండే పరిస్థితి ఏర్పడింది,ఇది గతంలో ఊహించని స్థాయిలో పెరుగుదల అని చెప్పవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు