- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో కంప్యూటర్ విభాగం కోసం ఇన్వెర్టర్ ను పట్టు చేనేత రంగానికి చెందిన చేనేత ప్రముఖులు కోటం పార్థసారధి కళాశాల ప్రిన్సిపాల్ వనిత వాణి కి విరాళంగా అందజేశారు. ప్రిన్సిపాల్ ఈ సందర్బంగా మాట్లాడుతూ రూ 25 వేలు విలువ కల ఈ ఇన్వెర్టర్ వలన కళాశాల కంప్యూటర్ విభాగానికి ఎంతో ప్రయోజనం అన్నారు.దాత కోటం పార్థసారధి కి కళాశాల తరుపున కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లోకాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, మహిళా లెక్చరర్లు, శాంతి, వనిత, చంద్ర కళ అరుణ, మునుస్వామి నాయుడు, రామాంజన రెడ్డి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


