Homeజాతీయంఏఐఏడీఎంకే చేరిక ఊహాగానమే..: అధవ్‌ అర్జున

ఏఐఏడీఎంకే చేరిక ఊహాగానమే..: అధవ్‌ అర్జున

- Advertisement -

కేబినెట్ విస్తరణ తేదీలను సీఎం ప్రకటిస్తారని వెల్లడి
తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ ముందే రాజకీయ సెగలు రేగాయి. ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకుంటే మద్దతు ఉపసంహరిస్తామన్న సీపీఎం హెచ్చరికలపై క్రీడాశాఖ మంత్రి ఆధవ్ అర్జున బుధవారం స్పందించారు. అవన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేశారు.

సీపీఎం చేసిన హెచ్చరికల నేపథ్యంలో తాము ఆ పార్టీ నేతలతో మాట్లాడామని అర్జున వెల్లడించారు. ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం కేబినెట్‌లో చేరుతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ వివాదానికి ఇక్కడితో తెరపడిందని పేర్కొన్నారు.

మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రకటిస్తారని అర్జున తెలిపారు. మంత్రులకు కేటాయించాల్సిన శాఖల పూర్తి జాబితాను ఇప్పటికే గవర్నర్‌కు అందజేసినట్లు వివరించారు. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ఈరోజే విడుదలవుతుందని స్పష్టం చేశారు. మంత్రులు బాధ్యతలు స్వీకరించినప్పటికీ శాఖల కేటాయింపు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.

అంతకుముందు ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రభుత్వంలోకి తీసుకుంటే తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీపీఎం గట్టిగా హెచ్చరించింది. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కోరింది. ఆ పార్టీలను చేర్చుకుంటే నీతివంతమైన పాలన సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన విజయ్ సర్కార్ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు