విశాలాంధ్ర – నల్లజర్ల : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు అన్నారు. నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పి.టీఎం3.0 ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడిగడప బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు తాతిని సత్యనారాయణ,, సొసైటీ చైర్మన్. రావి వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీవో. సింహాద్రి రావు, ఎంఈఓ వై సత్యనారాయణ, భగవతి దేవి, స్కూల్ కమిటీ చైర్మన్ లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పి.టి. ఎం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
మండలంలో ఘనంగా మెగా పిటిఎం3.0
- Advertisement -
RELATED ARTICLES


