విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలలో భాగంగా ధర్మవరం మండలంలో ఆరు పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ఎంఈఓ లు- రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో ప్రియదర్శని పాఠశాల పి. శ్రావణి అత్యధికంగా 596 మార్కులు సాధించిందని, తర్వాత పిసిఎంఆర్ , కాకతీయ పాఠశాలలలో చదువుతున్న యు. విష్ణు 595 మార్కులు సాధించడం జరిగిందన్నారు. తదుపరి ప్రభుత్వ మున్సిపల్ బి ఎస్ ఆర్ పాఠశాల బాలుర ఉన్నత పాఠశాలలో గుర్రం మనోజ్ కుమార్ 594 మార్కులు సాధించడం సాధించి మున్సిపల్ పాఠశాలలో మొదటి స్థానంలో ఉన్నారని తెలిపారు..అదేవిధంగా 593 మార్కులు సాధించి రెండవ స్థానం,590 మార్కులతో యు. ఓబులేసు మూడవ స్థానం సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల హెడ్మాస్టర్ లను ప్రత్యేకంగా అభినందిస్తూ, విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మండలంలోని ఎంజేపి రేగాటిపల్లి పాఠశాల 94 శాతము సాధించి మొదటి స్థానంలో ఉందని, తర్వాత కేజీబీవీ పాఠశాల 86 శాతము, బి ఎస్ ఆర్ బాలుర పాఠశాల 76 శాతము సాధించడం జరిగిందన్నారు. ఇంతటి ఘనత సాధించిన ఆయా పాఠశాల హెడ్మాస్టర్లకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు
నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు అభినందనలు తెలిపిన ఎంఈఓ లు
RELATED ARTICLES