Homeఅంతర్జాతీయంచర్చలకు సిద్ధం.. కానీ లొంగిపోయే ప్రసక్తే లేదు: ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

చర్చలకు సిద్ధం.. కానీ లొంగిపోయే ప్రసక్తే లేదు: ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీవ్రంగా స్పందించారు. శాంతియుత చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధమే అయినా, బలవంతపు ఆంక్షలు, బెదిరింపులతో తమను లొంగదీసుకోవచ్చని భావిస్తే అది అపోహే అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాలతో పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలనే కోరుకుంటున్నామని, అయితే తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.టెహ్రాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఁఇరాన్ ఏ దేశంతోనూ యుద్ధాన్ని గానీ, ఉద్రిక్తతలను గానీ కోరుకోవడం లేదు. ప్రాంతీయ, అంతర్జాతీయ వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంఁ అని తెలిపారు. అయితే, చర్చల పేరుతో ఏకపక్ష నిబంధనలు రుద్దాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఁఆంక్షలు, బెదిరింపుల ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని ఎవరైనా భావిస్తే అది వారి భ్రమే అవుతుందిఁ అని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విస్తరిస్తోందన్న ఆరోపణలతో అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) గత కొన్నేళ్లుగా ఆ దేశంపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో, దేశ ప్రయోజనాల విషయంలో కఠినంగా ఉంటామని పెజెష్కియాన్ అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు.

బాహ్య ఒత్తిడిని తట్టుకునేందుకు స్వయం సమృద్ధి సాధించడం, చైనా, రష్యా వంటి ఆసియా దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నామని అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. పాశ్చాత్య దేశాలతో ఆంక్షల నుంచి ఉపశమనం కావాలంటే అది సమానత్వ ప్రాతిపదికన జరిగే చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు