Wednesday, January 22, 2025
Homeజిల్లాలుఅనంతపురంపేదల సమస్యల పట్ల పోరాడే వ్యక్తి సత్ గాడ్గే బాబా

పేదల సమస్యల పట్ల పోరాడే వ్యక్తి సత్ గాడ్గే బాబా

ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య

సత్ గాడ్గే బాబా చిత్రపటానికి నివాళులర్పించిన ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య

విశాలాంధ్ర- అనంతపురం : చాకలి ఐలమ్మ కాలనీలో స్వచ్ఛ భారత్ కోసం పరితపించిన సత్ గాడ్గే బాబా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య మాట్లాడుతూ… గాడ్గే బాబా మహారాష్ట్రలో జన్మించారన్నారు. పేదల సమస్యల పట్ల పోరాడే వ్యక్తి అని కొనియాడారు. అప్పట్లోనే శ్రమదానం చేసి పరిశుభ్రత కోసం తపించాడని భారత్ రాజ్యాంగ నిర్మత బిఆర్ అంబేద్కర్ గాడ్గే బాబాని అభినందించడం జరిగిందన్నారు . అలాంటి మహనీయులని కేంద్ర ప్రభుత్వం వర్ధంతి జయంతి నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు సి నాగప్ప,ఐలమ్మ కాలనీ సిపిఐ కార్యదర్శి నాగరాజు, సహాయ కార్యదర్శిలు సంజీవులు, లక్ష్మీనారాయణ, చేతి వృత్తి దారుల సమాఖ్య గౌరవాధ్యక్షులు ఈశ్వరమ్మ చేతి వృత్తిదారుల సమాఖ్య నగర కార్యదర్శి వీరాంజి లక్ష్మీదేవి, వీర నారాయణప్ప, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు