- Advertisement -
విశాలాంధ్ర – మండపేట : పులి సంచారం నేపథ్యంలో మండలం లోని ద్వారపూడి కాంప్లెక్స్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు మండల విద్యా శాఖాధికారి నాయుడు రామచంద్రరావు తెలిపారు. మండలంలోని కేశవరం, జెడ్ మేడపాడు, ద్వారపూడి, వేములపల్లి గ్రామాల పరిధిలోని పాఠశాలలు ఈ సెలవు వర్తిస్తుందని, మిగిలిన గ్రామాల్లో యధావిధిగా స్కూళ్లు జరుగుతాయని ఆయన తెలిపారు.


