నిరు పేదలకు అండగా నిలిచిన ఎస్ ఐ దుర్గాప్రసాద్.
విశాలాంధ్ర -నల్లజర్ల: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రాల వద్ద తల దాచుకుంటున్న నిరుపేద కుటుంబాలను నల్లజర్ల ఎస్సై దుర్గ ప్రసాద్ కలిశారు. వారికి ముందుగా పండ్లు (ఫ్రూట్స్ ) లను అందజేశారు. మండలంలోని దూబచర్ల, కొత్తగూడెం, అయ్యవరం గ్రామాలలో ఆయన వెళ్లి నేరుగా నిరు పేదల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్ ఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో ఎవరింట్లో వారు ఉంటూ జీవనం సాగిస్తారని, కాని ఎటువంటి ఇళ్ళు లేకుండా విపత్తు పరిస్థితులో నిరు పేదలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న సమయం లో వారికి కాస్త దైర్యం చెప్పి వారికి అండగా నిలవడం ద్వారా వారికి దైర్యం కల్పించినవారు అవుతారని ఆయన అన్నారు. నిరు పేద కుటుంబాలకు తమ పోలీస్ నుంచి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్బంగా ఎస్ ఐ దుర్గాప్రసాద్ తెలియజేసారు. అనంతరం ఆ గ్రామాలలో ఉన్న చిన్నారులతో ఎస్ ఐ దుర్గాప్రసాద్ కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమం లో గుడిసె శివకృష్ణ, చుక్క శ్రీనివాస్,పురేళ్ళ సత్యనారాయణ, కఠారి సాయి తేజ, దూబచర్ల సర్పంచ్ తాడిగడప బాలయ్య, కడారి కొండబాబు, సూరిబోయిన చిన్న నాగేశ్వరావు, వి ఆర్ ఓ అరుణ జ్యోతి పలువురు సామజిక వేత్తలు పాల్గొన్నారు.


