విశాలాంధ్ర వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని పోకూరు గ్రామంలో జరుగుతున్న జాతీయగ్రామీణఉపాధిహామీ పనులను బుధవారం ఎంపిడిఓ నరేంద్ర దేవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.మస్టర్లను తనిఖీ చేసి చదివి వినిపించారు. ఈ సందర్బంగా వేసవికాలంలో కూలీలకు అందుతున్న వసతులను పరిశీలించారు. పనులకు సకాలంలో వచ్చి మీకు ఇచ్చిన కొలతలు ప్రకారం పని పూర్తి చేసుకొని పోవాలని అన్నారు.పనులు నాన్యతగా ఉండాలని అన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని పీల్డ్ అసిస్టెంట్ సుబ్బా నాయుడు ను ఆదేశించారు.పీల్డ్ అసిస్టెంట్ సుబ్బానాయుడు పని ప్రదేశంలో కూలీలకు కల్పించిన వసతులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో పీల్డ్ అసిస్టెంట్ నవులూరి సుబ్బానాయుడు పాల్గొన్నారు.