విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫొటోలకు రికార్డు స్థాయిలో లైకుల వర్షం
ఇన్స్టాగ్రామ్లో 23 మిలియన్ల మార్క్ను దాటిన పోస్ట్
భారత సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులను అధిగమించిన కొత్త జంట
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.అయితే అయితే ఈ వివాహం డిజిటల్ వరల్డ్లో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ నెల 26న ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట, తమ పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా లైకుల వర్షం కురుస్తోంది. ఈ పోస్ట్ కేవలం 24 గంటల్లోనే భారతీయ సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులన్నింటినీ తిరగరాసి, సోషల్ మీడియాలో వారికున్న అసాధారణమైన క్రేజ్ను మరోసారి నిరూపించింది.ఇప్పటివరకు బాలీవుడ్ జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫొటోలకు వచ్చిన 16 మిలియన్ల లైక్సే అత్యధిక రికార్డుగా ఉండేది. అయితే,విరోష్ (విజయ్-రష్మిక) జంట ఈ మైలురాయిని కేవలం 14 గంటల్లోనే దాటేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వీరి పోస్ట్ 23.3 మిలియన్ల లైక్స్తో దూసుకుపోతోంది. దీంతో అలియా భట్-రణబీర్ కపూర్ (13 మిలియన్ం), సమంత-నాగ చైతన్య (12 మిలియన్ం), కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ (10 మిలియన్ం), దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ (8 మిలియన్ం) వంటి స్టార్ కపుల్స్ రికార్డులను ఈ జంట అధిగమించింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే విరాట్ కోహ్లీ వ్యక్తిగత పోస్ట్ రికార్డుకు కూడా చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది.
దాదాపు ఎనిమిదేళ్ల రహస్య ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఒక్కటైన ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఁనా బెస్ట్ ఫ్రెండ్ను భార్యగా చేసుకున్నానుఁ అని విజయ్, ఁనాకు నిజమైన ప్రేమను పరిచయం చేసిన వ్యక్తిఁ అని రష్మిక పెట్టిన ఎమోషనల్ క్యాప్షన్లు నెటిజన్లను మరింతగా ఆకట్టుకున్నాయి. వీరి పెళ్లి ఫొటోలు టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ఉదయ్పూర్ వేడుకల అనంతరం మార్చి 4న హైదరాబాద్లో జరగనున్న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.


