- Advertisement -
లండన్: ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీకి చెందిన లండన్లోని ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో ఆయనకు విలాసవంతమైన పెంట్హౌస్ ఉన్నది. దీని విలువ రూ.140 కోట్లు (1.4 బిలియన్ డాలర్లు). అదే భవనంలోని మరో పెంట్హౌస్ విలువ 16.75 మిలియన్ డాలర్ల ధర ఉంది. మొత్తంగా విలువ 36 మిలియన్లు (దాదాపు 4.5 బిలియన్ డాలర్లు). అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇంటి యజమాని పేరు అలీ అన్సారీ. ఆయన ఇరాన్ బ్యాంకర్. రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఈ ఇంటిని వేలం వేస్తున్నట్లు సమాచారం.


