ముంబయి: భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఎన్బీఎఫ్సీలలో ఒకటి సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ డిజిటల్ డిపాజిట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా పొదుపులను మరింత సులభంగా, సురక్షితంగా మరియు అందుబాటులో ఉండేలా చేస్తోంది. 70 సంవత్సరాలకు పైగా ట్రస్ట్ మరియు ఆర్థిక భద్రతకు ప్రతీకగా నిలిచిన సుందరం ఫైనాన్స్, లక్షకు పైగా డిపాజిటర్లతో బలమైన స్థావరాన్ని కలిగి ఉంది. మూడున్నర దశాబ్దాలుగా, సంస్థ డిపాజిట్ల విషయంలో ఐసీఆర్ఏ, క్రిసిల్ నుండి ఏఏఏ రేటింగ్ను సాధించింది. ఇది అత్యున్నత స్థాయి భద్రత, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇప్పుడు, సుందరం ఫైనాన్స్లో డిపాజిట్ ఖాతా ప్రారంభించడం కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంది. వినియోగదారులు సులభతరమైన, సురక్షితమైన డిజిటల్ ప్రక్రియ ద్వారా తమ డిపాజిట్లను పెట్టుబడి పెట్టవచ్చు, నిర్వహించవచ్చు.