నటి జెత్వానీ కేసులో వచ్చే నెల 7 వరకు రిమాండ్
బుధవారం పీఎస్ఆర్ ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
కోర్టులో స్వయంగా వాదనలు వినిపించుకున్న పీఎస్ఆర్
బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపులకు సంబంధించి నమోదైన కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 7 వరకు పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపుతూ బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. పీఎస్ఆర్ ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు బుధవారం ఉదయం థర్డ్ ఏసీజేఎమ్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఛాంబర్లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట లాయర్తో కలిసి పీఎస్ఆర్ స్వయంగా వాదనలు వినిపించారు. జెత్వానీ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని వాదించారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తనకూ ఈ కేసుకు సంబంధం లేదని పీఎస్ఆర్ తెలిపారు.
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపిన కోర్టు
RELATED ARTICLES