Wednesday, June 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం బాధ్యతగా అనుకోవాలి..

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం బాధ్యతగా అనుకోవాలి..

విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఆపదలో ఉన్న వారిని రక్తదానం చేయడం బాధ్యతగా వ్యవహరించాలని విశ్వదేపా సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్లమోరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్త దాతల దినోత్సవం ను పురస్కరించుకొని కార్యాలయంలో అత్యధిక రక్తదానం చేసిన వారందరికీ సేవా సంఘం ఆధ్వర్యంలో చిరు సన్మానమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం అన్ని దానములకన్నా మిన్న అని తెలిపారు. రక్తదానం మరో ఇరువురికి ప్రాణదానం అవుతుందని తెలిపారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా రక్తదానం ఉంటుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి పునర్జన్మ కల్పించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాజుల సురేష్ తో పాటు చంద్ర, కేశవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాధవ, జుజర్ రఘు, నారాయణస్వామి, మధుసూదన్ నాయుడు, భార్గవ ,ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం, నాగార్జున, కిరణ్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు