రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్లాల దగ్గరకు వెళ్ళాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, ఇందిరాపార్క్ దగ్గర ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా..? అని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర సర్కార్లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ నేత బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢల్లీికి వెళ్లి మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు. 19వ తేదీ నుంచి 23 వరకు కళ్లాల్లోకి కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు.