జగన్ సర్కారుకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నెంబర్ 2ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.పంచాయితీ సర్పంచులు సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది.విచారణ చేపట్టిన అమరావతి హైకోర్టు ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.జీవోను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ సవాల్ చేసిన విషయం తెలిసిందే.