Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తెరపైకి కొత్త జిల్లాల ఏర్పాటు..ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌

ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చుతామని వైసీపీ గత ఎన్నికల వేళ పేర్కొనడం తెలిసిందే. ఈ అంశాన్ని వైస్సార్సీపీ మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఒకటి రెండురోజుల్లో నోటిఫికేషన్‌ వెలువరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం దీనికి ప్రతిబంధకంగా మారనుంది. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. జనాభా లెక్కల సేకరణ 2021 మే నాటికి పూర్తి కావాల్సి ఉండగా కొవిడ్‌ వల్ల వాయిదా పడిరది. అది ఎప్పటికి పూర్తవుతుందన్న విషయంలో స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుంత్వం ఆ నిబంధనను అధిగమించి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎలా ముందుకెళుతుందనేది, దీనికి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుందా అన్న విషయంలో స్పష్టత రావల్సి ఉంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. ఏపీలో 25 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. అయితే, అరకు పార్లమెంటు నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా దీన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఏపీలో 26 జిల్లాలుగా చేయాలన్నది ప్రతిపాదన.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img