Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినయ్‌ : హరీష్‌రావు

తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినయ్‌ అని మంత్రి హరీష్‌ రావు అన్నారు. మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపినా కలుపుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అమరులను మోదీ కించపర్చారన్నారు. తెలంగాణ త్యాగాలను, ఆకాంక్షను చిన్నగా చేసి చూస్తున్నారని అన్నారు. ఆరోజు తల్లిని చంపి బిడ్డను బతికించారని కామెంట్స్‌ చేశారని మోదీ, బీజేపీ నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ చట్టాల విషయంలో మూజువాణి ఓటుతో ఎలా బిల్‌ పాస్‌ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు మోదీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కార్మికుల వల్లే కరోనా వచ్చిందని ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుంభమేళా పెడితే కరోనా పెరగలేదా..? అని ప్రశ్నించారు. ట్రంప్‌ సభలు, ఎలక్షన్‌ ర్యాలీలతో కరోనా పెరగలేదా అని మంత్రి హరీష్‌రావు నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img