- Advertisement -
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పి డి. నరసింహ కిషోర్ జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ,వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. వీరుల త్యాగఫలం వృధా కాకుండా మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. అనంతరం ఆయన పోలీసు అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.


