నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి చేత ప్రమాణం చేయించిన అధ్యక్షుడు రామచంద్ర
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఏర్పడిన రాజకీయ అస్థిరతకు తెరపడింది.
తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించేందుకు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణస్వీకారం చేశారు.నేపాల్ రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ ఆమెతో ప్రమాణం చేయించి అధికారిక పదవికి ఆహ్వానించారు.సుశీల కర్కి, నేపాల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి రికార్డులు సృష్టించిన అనుభవజ్ఞురాలు మాత్రమే కాకుండా, ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగానూ ఆరుదైన ఘనత సాధించారు.ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం నేపాల్ రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఘనంగా జరిగింది.
వచ్చే ఏడాది మార్చిలో ప్రజాస్వామిక ఎన్నికలు
సుశీల కర్కి, కొద్దిమంది కీలక మంత్రులతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని రూపొందించి, వెంటనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు.వచ్చే ఏడాది మార్చిలో ప్రజాస్వామిక ఎన్నికలు నిర్వహించాలని ఆమె ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


