అరకు కాఫీ తరహాలో జీలుగ బెల్లం,నీరా తయారీని ప్రోత్సహించి, గుర్తింపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరి మామిడి పరిశోధన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంగయ్య తెలిపారు.జీలుగ నీరా,బెల్లం తయారీపై గురువారం అమరావతిలో హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్తలు, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ మధుమతి తదితరులతో సీఎం సమీక్ష జరిపారు.ఈ సమీక్షలో జరిగిన వివిధ అంశాల గురించి డాక్టర్ వెంగయ్య వివరించారు.
గిరిజనులకి ఉపాధి అవకాశాల కల్పన
తాటి చెట్ల బెల్లం, నీరా తయారీలోని విధానం ప్రకారం, జీలుగ చెట్ల కల్లును వినియోగించి బెల్లం, నీరా పానీయాన్ని రూపొందించడం ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని సీఎం సూచించారు.అదనంగా, ఇది ఆరోగ్య పరిరక్షణలో కూడా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా పాల్గొని, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై తన సూచనలు ఇచ్చారు.


