- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం : మండల స్పోర్ట్స్ మీట్ లో పట్టణానికి చెందిన రిషి విద్యాలయ పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని డీన్. భాస్కర్ , ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. తదుపరి సీఈఓ రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో రాణించుటకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రంగారెడ్డి తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


