- Advertisement -
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి మొంథా తుపానుగా రూపాంతరం చెందడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొత్తం 43 రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాలకు నడవాల్సిన రైళ్లను తుపాను ప్రభావం కారణంగా రద్దు చేసినట్లు వివరించారు.తుపాను ప్రభావం నేపథ్యంలో రద్దు చేసిన ఈ రైళ్ల జాబితాను విడుదల చేసింది.
ప్రయాణానికి ముందు తప్పనిసరిగా తమ రైలు స్థితిని చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు.


