Homeఆంధ్రప్రదేశ్నెల్లూరు మేయర్‌ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు

నెల్లూరు మేయర్‌ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు

- Advertisement -

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌ స్రవంతిని లక్ష్యంగా చేస్తూ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు.ఈ నోటీసును మొత్తం 40 మంది కార్పొరేటర్లు జేసీ వెంకటేశ్వర్లుకు సమర్పించారు.
మేయర్‌ దంపతులు నగర అభివృద్ధి కార్యక్రమాలకు తరచూ అడ్డంకులు సృష్టిస్తున్నారని కార్పొరేటర్ల ఆరోపణ.వారి వ్యవహార శైలి, అవినీతితో ప్రభుత్వానికి చెడు పేరు తీసుకొస్తోందని వారు పేర్కొన్నారు.

మేయర్‌ దంపతుల జోక్యంతో ఫైళ్లు ముందుకు కదలకుండా పోతున్నాయని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ అంశాలన్నింటినీ ఆదివారం మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం సోమవారం మేయర్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు జారీ చేశారు.గతంలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో నగరంలోని 54 డివిజన్లను వైకాపా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి జిల్లాలో భారీ ఎదురుదెబ్బ తగలడంతో, మేయర్‌ ప్రస్తుతం తటస్థంగా ఉంటున్నారు.నగర అభివృద్ధిపై ఆమె సరైన శ్రద్ధ పెట్టలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు