Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

బురదలో దిగి నిరసన తెలిపిన మహిళలు

నెల్లూరు జిల్లా : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, చంద్రబాబునగర్,గిరిజన కాలనీలలో రోడ్లు కాలువలని తలపిస్తున్నాయి. డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. దాంతో రాకపోకలకి ప్రజలు అల్లాడిపోతున్నారు.స్థానిక మహిళలు రోడ్లలోని బురద నీటిలో దిగి నిరసన తెలిపారు. కనకపట్నం చేస్తామన్నారు… ఇదేనా అంటూ ప్రజాప్రతినిధులని ప్రశ్నించారు. వార్డు పర్యటనకు వచ్చిన మున్సిపల్ శివారెడ్డిని మహిళలు ప్రశ్నించారు. 16,వార్డులో వీధి దీపాలు లేక రాత్రి వేళల్లో పాములు,తేళ్లూ,పందులు ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు.తాగునీటి వసతి గురించి పట్టించుకునే దిక్కులేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img