- Advertisement -
మండపేట : శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం గా పోలీసులు పనిచేస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా ఈస్ట్ జోన్ డిఎస్పీ బి.విద్య అన్నారు. మండపేట పట్టణ పోలీసు స్టేషన్ ను ఆమె సందర్శించారు. నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన తర్వాత తొలి సారిగా డిఎస్పీ మండపేట విచ్చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ టీవీ నిఘా వ్యవస్థను పరిశీలించి టౌన్ సీఐ సురేష్ ను అభినందించారు. పిర్యాదు దారుల పట్ల వ్యవహరించాల్సిన పద్ధతులను, పలు ఇతర సూచనలను తెలియజేశారు.


