Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్‌

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఫురుషుల హాకీ టీమ్‌ కాంస్య పతకం గెలుపొందింది. గురువారం జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో భారత్‌ జట్టు 5-4 తేడాతో విజయాన్ని అందుకుంది.భారత ఫురుషుల హాకీ టీమ్‌ ఎట్టకేలకి 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పతకం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇప్పటికే వెయిల్‌లిప్టర్‌ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ లవ్లీనా కాంస్య పతకాలు అందించారు. తాజాగా హాకీ టీమ్‌ కాంస్య పతకంతో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకి చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img