Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

సేంద్రీయ వ్యవసాయం చేసిన ఆదర్శ రైతుకు ఘన సన్మానం

విశాలాంధ్ర` ఉరవకొండ : ఉరవకొండ మండలం నేరమెట్ల గ్రామని చెందిన సేంద్రియ వ్యవసాయం చేసిన ఆదర్శ రైతు గోపాల్‌ రెడ్డి ని జై కిషన్‌ ఫౌండేషన్‌ బృందం బుధవారం తన పొలంలోనే ఘనంగా సన్మానించారు. తనకున్న రెండు ఎకరాల భూమిలో సేంద్రియ మందులతోనే సాగు చేసి మిరప పొలానికి కేవలం పది సార్లు మందులు ,13 వేల రూపాయలు ఖర్చు మాత్రమే పెట్టుబడి పెట్టి సాటి రైతులకు ఆదర్శంగా నిలిచారని జై కిసాన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు నాగమల్లి ఓబులేసు తెలిపారు మిరప పంటను పరిశీలించి మందులు వివరాలు ఖర్చులు, పంట సాగు విధానాలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జై కిసాన్‌ ఫౌండేషన్‌ బృందం సభ్యులు సురేంద్ర, దాదావళి, రమేష్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img