- Advertisement -
ఉత్తర జపాన్లో 6.9 తీవ్రతతో ఈరోజు (గురువారం) భారీ భూకంపాలు సంభవించాయి. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటే ఉత్తర ప్రాంతానికి దూరంగా భూకంపాలు ఏర్పడ్డాయని, దీని కేంద్రం సముద్ర మట్టానికి 50 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో టోక్యోతో సహా దేశంలోని చాలా ప్రాంతాలు భూకంపాలతో వణికిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఇళ్లల్లోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.


