- Advertisement -
ఆలయ కమిటీ అధ్యక్షుడు సూర్య ప్రకాష్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో వెలిసిన సాయిబాబా దేవాలయమునకు సూరత్ రాష్ట్రానికి చెందిన రాజీవీజరీ ఇండస్ట్రీస్ అధినేత సూరత్ అన్నదానం కొరకు 25 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా సన్మానిస్తూ వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ నిత్యాన్న దానమునకు విరాళం ఇచ్చిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాంప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి, ఉప కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసరావు తో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు.


