Homeజాతీయంఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవి లభించింది. కేంద్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) ఉత్తర్వులు జారీ చేసింది.

సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ప్రసన్న వెంకటేశ్ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా ఆయన అందించిన సేవలు సుపరిచితమే.

దేశవ్యాప్తంగా వివిధ ప్రవేశ, అర్హత పరీక్షలను నిర్వహించే ఎన్‌టీఏ వంటి కీలక సంస్థకు డైరెక్టర్‌గా నియమితులు కావడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఆయనకు మరో ముఖ్యమైన బాధ్యతను అప్పగించినట్లయింది. ఏపీ కేడర్ అధికారికి జాతీయ స్థాయిలో ఈ పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు