జీహెచ్ఎంసీ క్లారిటీ..
వ్యక్తిగతంగా తమ తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే టులెట్ బోర్డులపై ఎలాంటి జరిమానాలూ ఉండవని జీహెచ్ఎంసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. సొంత ఇంటికి టులెట్ బోర్డు పెట్టినా.. జరిమానా అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే అన్ని రకాల పోస్టర్లపై మాత్రం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లోని అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, వాల్ రైటింగ్ తదితరాలపై అధికారులు బుధవారం జరిమానా విధించారు.