వాషింగ్టన్: దాదాపు రెండువేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. మిగిలినవారిలో కొంతమందిని మినహాయించి వేలమంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు సమాచారం. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెబ్సైట్లోని నోటీసు ఈ మేరకు వెల్లడిరచింది. ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాతే ట్రంప్ యంత్రాంగం ఈ విషయంలో ముందుకెళ్లారు. ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్ నికోలస్ తోసిపుచ్చారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పనిచేస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్ ఇప్పటికే అనేకమంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. అయితే యుఎస్ఎయిడ్ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్ ఇప్పటికే ఆరోపించారు. అందుకే నిధులను ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులోభాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ ఆదేశాలపై ఫెడరల్ జడ్జి అమీర్ అలీ గతవారం తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు యూఎస్ఎయిడ్ ద్వారా సాయం అందించడానికి ఆమోదం తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపేయగలదని జడ్జి నిలదీశారు. అయినా ట్రంప్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు, మానవతా దృష్టితో సహాయానికీ ‘యూఎస్ ఎయిడ్’ ద్వారా అందుతున్న నిధులను అమెరికా ప్రభుత్వం ఆపివేసిన విషయం తెలిసిందే.
2 వేల మంది ‘యూఎస్ ఎయిడ్’ ఉద్యోగులపై వేటు
RELATED ARTICLES