Wednesday, March 12, 2025
Homeఆంధ్రప్రదేశ్వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు

వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు

గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం మరోసారి రిమాండ్ ను పొడిగించింది. వల్లభనేని వంశీని జైలు అధికారులు నేడు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వంశీకి మార్చి 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనూ ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఆయనకు కోర్టు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో రిమాండ్ ముగిసిన వెంటనే, ఇదే విధంగా ఆన్ లైన్ పద్ధతిలో వంశీని కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు