Homeఆంధ్రప్రదేశ్యువ ఆర్చర్ ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

యువ ఆర్చర్ ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

- Advertisement -

విజయవాడకు చెందిన యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. టర్కీలోని అంటాల్యాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 పోటీల్లో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో ధీరజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కుంకుమ్ అనిల్ మోహోద్‌తో కలిసి దక్షిణ కొరియా అగ్రశ్రేణి జోడీని ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు. అనంతరం అదే రోజు జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత లీ వూ-సియోక్‌పై 7-3 తేడాతో ఘనవిజయం సాధించి, తన కెరీర్‌లో తొలి వ్యక్తిగత వరల్డ్ కప్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఁబలమైన ప్రత్యర్థులపై అద్భుత ప్రదర్శన కనబర్చి ధీరజ్ సాధించిన ఈ విజయం రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి గర్వకారణం. ఈ ఘనత ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందిఁ అని పేర్కొన్నారు. ధీరజ్‌తో పాటు కుంకుమ్ మోహోద్‌ను, భారత బృందాన్ని కూడా ఆయన అభినందించారు. భారత ఆర్చరీ రంగానికి ఈ విజయం ఒక మైలురాయిగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక భారతీయ పురుష ఆర్చర్ వరల్డ్ కప్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించడం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు