- Advertisement -
విశాలాంధ్ర,పెనుమంట్ర :పశ్చిమ గోదావరి జిల్లా వన్ స్టాప్ సెంటర్కు 2025–26 సంవత్సరానికి అద్దె ప్రాతిపదికన వాహనం నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి వెల్లడించారు. ఆసక్తి గల వ్యక్తులు ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు తమ దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు.దరఖాస్తులు సమర్పించవలసిన కార్యాలయం: జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కార్యాలయం, కలెక్టర్ ప్రాంగణం, భీమవరం.వివరాల కోసం అభ్యర్థులు పై కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.


