విశాలాంధ్ర ధర్మవరం:: రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రతి గ్రామములో నిర్వహించబడే రీ సర్వేలో అందరికీ తప్పక న్యాయం చేకూర్చుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని తుమ్మలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక లోని గ్రామసభను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, షెడ్యూల్ తేదీల ప్రకారం పరిష్కరించబడుతుందని తెలిపారు. తదుపరి కొంతమంది రైతులు తమ సమస్యలను విన్నవించుకున్నారు
ఏ సమస్య అయినా కూడా సచివాలయంలో ఇవ్వాలని వారు తెలిపారు. తదుపరి తుమ్మల లోని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని అన్ని రికార్డులను వారు పరిశీలిస్తూ, ఉద్యోగుల అటెండెన్స్ లను తనిఖీ చేస్తూ సమయపాలనలో తేడా రాకూడదని వారు హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. ఉద్యోగులందరూ కూడా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే గ్రామ ప్రజల సమస్యలు సులభతరంగా పరిష్కారం అవుతాయని వారు సూచించారు. విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సురేష్ బాబు, వీఆర్వో ప్రసాద్ ,గ్రామ సర్వేయర్ వాణి, సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రీ సర్వేలో అందరికీ న్యాయం జరుగుతుంది.. ఆర్డీవో మహేష్
వీఆర్వో గిరిధర్ రెడ్డి పై చర్యలు గైకొనండి ..బాధితుల ఆవేదన
.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వో గిరిధర్ రెడ్డి పై చర్యలు గైకొనాలని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మండల పరిధిలోని పోతుకుంట గ్రామానికి చెందిన మహిళ రైతు శ్రీ లత తన బాధను వ్యక్తం చేసింది. నా భూమి కి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను వీఆర్వో బీరువాలో పెట్టుకుని నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడని తెలిపింది. అంతకుమునుపే వీఆర్వో ఓ రైతు గొడవ పడుతుండగా, మధ్యలో జోక్యం చేసుకొని నా విషయంలో కూడా వీఆర్వో పనిచేయటం లేదని, బాహాటంగా మూడు లక్షల రూపాయలు లంచం ఇస్తేనే పని చేస్తారని తెలిపాడని ఆమె వాపోయింది. దీంతో ఆవరణంలో ఉన్న ఓ వ్యక్తి ఆ గొడవ దృశ్యాన్ని సెల్ ద్వారా తీసి సోషల్ మీడియాకు పంపడంతో అది వైరల్ గా కొనసాగింది. దీంతో ఆర్డీవో మహేష్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో సురేష్ బాబు వీఆర్వో అయిన గిరిధర్ రెడ్డి పై విచారణ జరిపి, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.
ఘనంగా దీపారాధన.. దర్గా కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల ఖాద్రి రోజా ఏ ముబారక్, ధర్మవరం శ్రీ హజరత్ సయ్యద్ మహమ్మద్ షా ఖాదర్ వలీ రహమతుల అలై వారి 98వ ఊరుసే షరీఫ్ వేడుకలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఘనంగా దర్గా కమిటీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూడవరోజు దీపారాధన ఫతేహా కానీ, జియారత్ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మత పెద్దలు దర్గాలోని సమాధులకు ప్రత్యేక పూజలు, చదివింపులు నిర్వహించారు. ప్రతి సంవత్సరము జరిగే ఈ ఉరుసు భక్తాదులు, దాతల సహాయ సహకారములతో హిందూ మహమ్మదీయ సోదరి సోదరుల సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని కమిటీ వారు తెలిపారు. ఈ ఉరుసు కార్యక్రమానికి విరాళాలు అందించిన వారికి, సహాయ సహకారాలను అందజేస్తూ సేవలు అందించిన వారందరికీ పేరుపేరునా దర్గా కమిటీ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్త వాల్ ఖాజా హుస్సేన్, సోలిగాల్ల చిన్న వెంకటేశులు, మహబూబ్ అలీ, హైదర్ వలీ, సబ్జాన్, వెల్దుర్తి బాబా ఫక్రుద్దీన్, ముక్తియార్, దర్గా ముజావర్ ఖాద్రీ నవాజ్, షఫీక్, సభ్యులు రోషన్ జమీర్,తాహిర్ ,బాబావాలి, నూర్ మొహమ్మద్, జబీబుల్లా, హాజీవలి, ఆల్ హజ్ కాజా హుస్సేన్, మహబూబ్ వలీ, ఖాదర్ వలీ, అజ్జు, షాషావలి, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు సిపిఐ ఉద్యమ కార్యాచరణ
సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు కలిసి ఉద్యమ కార్యాచరణ రూపుదిద్దుకుంటున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ప్రధాని మోడీకి లొంగిపోయి, అదానితో లాలూచీపడి ప్రజలపై భారం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే 6,072 కోట్లు వసూలు చేసేందుకు చార్జీలు పెంచి డిసెంబర్ నెల నుంచి వసూల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతోందన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదనతో మరో 11,820 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపడానికి పూనుకుంటున్నారు అని పేర్కొన్నారు. ప్రజా సంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ విద్యుత్ చార్జీలు పెంచడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు హామీలు గాలికొదిలి కరెంట్ చార్జీలు పెంచమని చెప్పి కరెంట్ చార్జీలు పెంచబోతున్నారు అని తెలిపారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారన్నారు. గోరుచుట్టు పై రోకటి పోటులాగా గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు. బుధవారం నుండి ఈనెల 30 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యం చేస్తూ సభలు ,సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్లో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వామపక్ష పార్టీలు మద్దతు తెలిపారు అన్నారు. ప్రజలపై భారం వేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని భారతకమ్యూనిస్టు పార్టీ, సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు.
ఐ ఎఫ్ టి యూ నుండి మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ లోకి చేరిక
ముద్దలాపురం ఫిల్టరేషన్ ప్లాంట్ కార్మికులకు టి ఏ లు పెంచాలి..
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్
విశాలాంధ్ర- అనంతపురం : ముద్దలాపురం ఫిల్టరేషన్ ప్లాంట్ కార్మికులకు టి ఏ లు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) కార్మిక సమస్యలపై నిర్వహిస్తున్న పోరాటాలు చూసి ఐ ఎఫ్ టి యూ లో నుండి ఏఐటీయూసీ బుధవారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి,ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్,ఎఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణుడు,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి ఎఐటియుసి లో చేరుతున్న కార్మికులకు కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ఎఐటియుసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేస్తున్న పోరాటాలు చూసి కార్మికులు ఎఐటియుసి లో చేరుతున్నారన్నారు. మున్సిపల్ కార్మికులు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అన్నిరకాల సేవలు అందిస్తున్నారన్నారు. నగరానికి సుదూర ప్రాంతంలో ఉన్న ముద్దలాపురం ఫిల్టరేషన్ ప్లాంట్ లో రాత్రి,పగలు అని తేడా లేకుండా కష్టపడుతూ నగర ప్రజలకు తాగు నీటిని అందిస్తున్నారన్నారు. ఇంత కష్టపడుతున్న కార్మికులకు మాత్రం కనీస వేతనాలు ,ఇతర ఈపీఎఫ్ సమస్యల ను పరిష్కరించడం లేదన్నారు. ముద్దలాపురంకు రావడానికి పోవడానికి ఇస్తున్న ట్రావలింగ్ అలవెన్సులు కూడా సరిగా ఇవ్వడం లేదని, టి ఏ లు కూడా పెంచాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శులు నాగరాజు,వేణుగోపాల్,సమితి సభ్యులు కుళ్ళాయి రెడ్డి,నారాయణ స్వామి,గిరి
ఎఐటియుసి లో చేరిన వారు రాజు,వెంకటరమణ,భాస్కర్,ఇర్ఫాన్,వీరాంజనేయులు,లక్ష్మినారాయణ,పెద్దన్న,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ప్రశ్నలకు అనిత సమాధానాలు
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న అనిత
ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ హోం మంత్రి అనిత విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వారిని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అనిత సమాధానమిచ్చారు. ఐదేళ్లలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని… దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని తెలిపారు. గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని… ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. వారి ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… గంజాయిని కట్టడి చేసే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని స్పీకర్ ను కోరారు. ఈ సమావేశాలు లేదా వచ్చే సమావేశాల్లోనైనా చర్చిద్దామని చెప్పారు.
అసెంబ్లీలో నేడు ఆరు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు రానున్నాయి.. ప్రశ్నోత్తరాల తో అనంతరం ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్.ఎంఎడి.ఫరూక్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు..
రుషికొండ నిర్మాణాలు, NGT నిబంధనల ఉల్లంఘన.. వరదల వల్ల ఏర్పడిన పరిస్ధితులపై స్వల్పకాలిక చర్చ సాగనుంది..
ఇక, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లు విషయానికి వస్తే..
ప్రభుత్వ బిల్లులు:1. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టం 2024, మంత్రి అనగాని సత్యప్రసాద్
- ఏపీ మునిసిపల్ చట్టాల రెండవ సవరణ బిల్లు 2024, మంత్రి నారాయణ
- AP GST సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్
- AP VAT సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్
- ఏపీ ధర్మ, హిందూమత సంస్ధలు, దేవాలయాల చట్ట సవరణ బిల్లు 2024, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ రిపీల్ బిల్లు 2024, బి.సి.జనార్ధనరెడ్డి
మంత్రుల ఇచ్చే స్టేట్మెంట్లు..
- డ్రోన్ పాలసీ పై మంత్రి బి.సి.జనార్ధనరెడ్డి2. స్పోర్ట్స్ పాలసీ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి3. పర్యాటక పాలసీ పై మంత్రి కందుల దుర్గేష్4. ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ పాలసీలపై మంత్రి నారా లోకేష్మరోవైపు..
శాసన మండలిలో
నేడు కౌన్సిల్ లో.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.. ఇక, అంగన్వాడీల సమస్యలపై కౌన్సిల్ లో తాత్కాలిక చర్చ సాగనుంది..
శాసన మండలిలో ప్రభుత్వ బిల్లులు:
- ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
- భారత దేశంలో తయారైన విదేశీ మద్యం నియంత్రణ సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
- ఏపీ ప్రొహిబిషన్ సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
- ఏపీ అప్రాప్రియేషన్ సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్
గౌతమ్ అదానీపై రూ.2,236 కోట్ల లంచం ఆరోపణలు..
అమెరికాలో కేసు, అరెస్ట్ వారెంట్ జారీ!
సంచలన పరిణామం చోటుచేసుకుంది. భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. లంచం, మోసపూరిత కుట్ర కింద అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయని అధికారులు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్లపై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయాయి. అంతేకాదు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు.
అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈవో వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని ాన్యూమెరో యునో్ణ, ాబిగ్ మ్యాన్్ణ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరుని ప్రైవేట్గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు.
కాగా అమెరికాలో నమోదయిన ఈ అభియోగాలపై అదానీ గ్రూప్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ పరిణామంపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇంకా స్పందించలేదు. నిందితుల తరఫు న్యాయవాదులు ఎవరనేది కూడా ఇంకా తెలియరాలేదు.
పదో తరగతి విద్యార్థులు తెలుగులో కూడా పరీక్షలు రాసుకోవచ్చు.. అవకాశమిచ్చిన ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యంలోనే రాసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో ఈ మేరకు సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితం కానుంది. 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతులను ఇంగ్లిష్ మాధ్యమంలోకి మార్చుతూ అప్పటి సర్కారు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఒక్కో తరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్టు ప్రకటిస్తూ పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన విధించింది. అయితే, సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు దాఖలు ాకావడంతో ాఇంగ్లిష్ మీడియం అని చెప్పకుండా ాఒకే మాధ్యమం ఉండాలని ఆదేశించింది. ఒకే మాధ్యమం అని చెప్పి, అది ఏ మాధ్యమం అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా పాఠశాల్లలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండింటినీ కొనసాగించారు. ఈ నేపథ్యంలో తెలుగులో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలంటూ ఉపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి తెలుగులో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఘనంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం….
కరెస్పాండెంట్ నరేంద్రబాబు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్ లో గల సూర్య ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు నడుమ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ నరేంద్రబాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 1989లో బాలల హక్కుల సదస్సును అసెంబ్లీ ఆమోదించిన రోజును సూచిస్తుందని తెలిపారు. మానవ హక్కుల ఒప్పందమైన హింస నుండి రక్షించడానికి, జీవించే హక్కు, ఆరోగ్యం ,విద్య, ఆటలు, అనేక బాలల హక్కులను నిర్దేశిస్తుందని తెలిపారు. ఇదే రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవం గా కూడా జరుపుకుంటారని తెలిపారు. పాఠశాలలో వివిధ ప్రదర్శన కూడా నిర్వహించిన వైనం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జ్యోతి, మారుతి, సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.