- Advertisement -
విశాలాంధ్ర – కడియం : కడియం అరుంధతి పేటకు చెందిన నాటిక వీర్రాజు భార్య నాటిక సరోజిని ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. కుటుంబ పోషకురాలి మరణంతో వీర్రాజు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. విషయాన్ని స్థానిక వైసీపీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న , రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు నగదు ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు, అరుంధతిపేట పెద్దలు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


