- Advertisement -
రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం : చేనేత కార్మికులకు కంటి వైద్య చికిత్సలు అందించడం నాకెంతో తృప్తిని, సంతోషాన్ని కలిగించిందని జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ శంకరప్ప నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవంను పురస్కరించుకొని పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల తన క్లినిక్ లో 35 మంది చేనేత కార్మికులకు కంటి వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం పట్ల చేనేత కార్మికులు కూడా తమ కృతజ్ఞతలను తెలియజేశారు.


