- Advertisement -
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.


