Homeజాతీయంసుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌!

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌!

- Advertisement -

దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)బీఆర్ గవాయ్ తన తరువాతి వారసుడిగా సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ సూర్యకాంత్‌ను సిఫార్సు చేశారు.జస్టిస్‌ గవాయ్‌ నవంబర్‌ 23న పదవీ విరమణ చేయనుండగా, ఆయన పదవీకాలం ముగియడానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించింది.
ప్రభుత్వం అధికారికంగా సీజేఐ గవాయ్‌కి ఉత్తరం పంపి, తన వారసుడి పేరును సూచించాలని కోరిందని వర్గాలు తెలిపాయి.

సీనియారిటీ ఆధారంగా తగిన అర్హత ఉన్న న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి
సుప్రీం కోర్టు,హైకోర్టు న్యాయమూర్తుల నియామక, బదిలీ ప్రక్రియలపై ఉన్న నిబంధనల ప్రకారం, సుప్రీం కోర్టులో సీనియారిటీ ఆధారంగా తగిన అర్హత ఉన్న న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి.
1962 ఫిబ్రవరి 10న హర్యానా రాష్ట్రంలోని హిసార్‌ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్‌ సూర్యకాంత్‌ 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.అనంతరం 2000 జూలై 7న 38 ఏళ్ల వయసులో హర్యానా అడ్వకేట్‌ జనరల్‌గా నియమితులై ఆ రాష్ట్ర చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్‌ జనరల్‌గా నిలిచారు.

53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు
తదుపరి 2004 జనవరి 9న పంజాబ్‌-హర్యానా హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2018 అక్టోబర్‌ 5న హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.తరువాత 2019 మే 24న సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సీజేఐగా నియమితులైన వెంటనే, జస్టిస్‌ సూర్యకాంత్‌ నవంబర్‌ 24న దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీకాలం 2027 ఫిబ్రవరి 9 వరకు సుమారు 15 నెలలు కొనసాగనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు