Friday, January 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఐక్యతగా ముందుకెళ్దాం సమస్యలను పరిష్కరించుకుందాం.. కుంచెపు గంగరాజు

ఐక్యతగా ముందుకెళ్దాం సమస్యలను పరిష్కరించుకుందాం.. కుంచెపు గంగరాజు

విశాలాంధ్ర -తనకల్లు :సమన్వయంతో సంఘటితంగా నియోజకవర్గంలోని వడ్డెర్లందరూ ఐకమత్యంతో ముందుకెళ్లి సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేద్దామని కదిరి నియోజకవర్గం వడ్డెర్ల సంఘం అధ్యక్షుడు కొంచెపు గంగరాజు అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవాలయంలో మండలంలోని వడ్డెర్లందరూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరి నియోజకవర్గ ఓడ్డెర్ల సంఘం అధ్యక్షుడు కుంచపు గంగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర్లు ఆర్థికంగా ఎదగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు ముఖ్యంగా తమ పిల్లల చదువులపై నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఒక్క వడ్డెర పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి ప్రోత్సాహం అందివాలన్నారు మండలంలో దాదాపు 60 మంది రాచ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారి కుటుంబాలకు భరోసా తో పాటు ఎటువంటి రాజకీయ వచ్చిండు తమపై ప్రభావం చూపకుండా చూస్తామన్నారు భవన నిర్మాణ కార్మిక వృత్తిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి ముందుంటామన్నారు. వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సమస్యను పరిష్కరించుకుందామని ప్రతి మండలంలో గ్రామస్థాయి నుంచి వడ్డెరలను బలోపేతం చేసి కమిటీల ద్వారా సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
మండల నూతన కమిటీ ఎన్నిక.. మండల అధ్యక్షుడుగా ఈ తోడు కిష్టప్పఉపాధ్యక్షుడిగా బూడిదగడ్డ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర మండల మహిళా అధ్యక్షురాలుగా హిమగిరి ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వల్లపు ఉత్తన్న గౌరవ అధ్యక్షుడు గంగరాజు తాలూకా కమిటీ ఉపాధ్యక్షులు డేరంగుల గంగరాజు ప్రధాన కార్యదర్శి వల్లపు వడ్డే బాబు ప్రచార కార్యదర్శి నాగార్జున తలుపుల సెక్రెటరీ అనిల్ గాండ్లపెంట అధ్యక్షులు గంగరాజు యూత్ లీడర్ రాజేష్ కదిరి ప్రచార కమిటీ శివ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు రమణమ్మ జయరాం తో పాటు మండలంలోని అన్ని వడ్డెర కుటుంబాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు