దేశవ్యాప్తంగా ఈ నెల 17 నుండి అక్టోబరు 2 వరకు ఁస్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ఁ పేరుతో కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
ఈ అభియాన్ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమగ్రంగా అమలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 17న హైదరాబాద్లోని అమీర్పేట పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభోత్సవం చేపట్టనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,159 వైద్య శిబిరాలు
కార్యక్రమాల నిర్వహణపై సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు జూమ్ సమావేశం జరిగింది.
ప్రతి జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఈ అభియాన్ 15 రోజుల పాటు కొనసాగనుండగా, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒక్కో మెగా వైద్య శిబిరం మహిళల కోసం ఏర్పాటు చేయబడనుంది. అంతేకాక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,159 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాల్సిందిగా అధికారిక ఆదేశాలు జారీ చేశారు.


