- Advertisement -
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి కడపకు తరలించారు. ఈ సమయంలో ఎర్రగుంట్ల వద్ద వైసీపీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అవినాష్రెడ్డి కూడలి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం, పోలీసుల కళ్లను మాయంచేసి ఎర్రగుంట్ల నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు. సింహాద్రిపురం వైపు వెళ్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు వెంటాడుతున్నారు. ప్రస్తుతం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అవినాష్రెడ్డిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


