ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో అందుకున్నారు.ఆమె ఎంపికపై వెనెజువెలా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకార చర్యలు చేపట్టింది.ఆ చర్యల్లో భాగంగా, నార్వేలో ఉన్న తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.దౌత్య వ్యవహారాల అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని వివరించింది.అదే సమయంలో, జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియాలోని రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు తెలిపింది.
వెనెజువెలా అధ్యక్షుడిగా నికోలస్ మదురో
ఈ నిర్ణయంపై నార్వే విదేశాంగ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నా,వెనెజువెలాతో సంభాషణలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
అలాగే, నోబెల్ బహుమతి ఎంపిక అనేది నార్వే ప్రభుత్వ నిర్ణయం కాదని, అది స్వతంత్ర కమిటీ పరిధిలో జరిగిందని కూడా వివరించింది.మరియా కొరినా మచాదో వెనెజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం దీర్ఘకాలం పోరాటం చేసినందుకే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇవ్వబడిందని నోబెల్ కమిటీ పేర్కొంది.
ప్రస్తుతం వెనెజువెలా అధ్యక్షుడిగా నికోలస్ మదురో ఉన్నారు. అయితే ఆయన ఎన్నికను అమెరికా సహా అనేక దేశాలు గుర్తించలేదు.
ఇప్పటివరకు స్పందించని వెనెజువెలా ప్రభుత్వం
మచాదోకు నోబెల్ బహుమతి ప్రకటించిన నేపథ్యంలో వెనెజువెలా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.అయితే, దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలనే నిర్ణయం ఆ అసంతృప్తిని సూచిస్తోంది.ఇక, తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అంకితం చేస్తున్నట్లు మచాదో ప్రకటించారు.


