Homeఅంతర్జాతీయంనాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్‌ మహిళ

నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్‌ మహిళ

- Advertisement -

చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించకుండా చైనా అధికారులు నిరాకరించారని భారత మహిళ, పెమా వాంగ్‌జోమ్‌ థాంగ్‌డోక్‌ వెల్లడించారు.ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారికి, అలాగే భారత విదేశాంగశాఖ అధికారులు చూపిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.అయితే, తన ఇబ్బందులను కూడా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేసేవారికి రిప్లై ఇచ్చేంత సమయం తనకు లేదని వెల్లడించారు.

జపాన్‌కు వెళ్లే విమానంలో ఎక్కనివ్వలేదు: పెమా
తన వద్ద చెల్లుబాటైన వీసా ఉన్నప్పటికీ, చైనా అధికారులు ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, జపాన్‌కు వెళ్లే విమానంలో ఎక్కనివ్వలేదని పెమా చెప్పారు.చివరకు ఆహారం కొనేందుకు కూడా అంగీకరించలేదని ఆమె వివరించారు. సమస్యను భారత దౌత్య విభాగానికి తెలియజేసిన ఒక గంటలోపు, భారత అధికారులు విమానాశ్రయంలోకి వచ్చి ఆమెకు ఆహారం అందించి, చైనా అధికారులతో మాట్లాడి, ఆమెను ఆ దేశం నుండి బయటకు వచ్చేలా సహాయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు