Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

50శాతం రాయితీ పై పచ్చి రొట్టె విత్తనాలు పంపిణీ

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలోని నేకునాంపురం గ్రామ సచివాలయం నందు సింగమనేనిపల్లి గ్రామ రైతులకు 50 శాతం రాయితీతో పచ్చి రొట్టె విత్తనాలు( జనుములు ) పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొత్తం మండలానికి జనుములు 199 క్వింటాళ్లు, పిల్లిపెసర 21.40 క్వింటాళ్లు మరియు జీలుగ 1.90 క్వింటాళ్ల కు రైతులు రిజిస్ట్రేషన్ మరియు నగదు చెల్లించారని తెలియజేసినారు, జనుము కేజీ పూర్తి ఖరీదు 84రూపాయలు రైతు కట్టవలసినది 42రూపాయలు అలాగే పిల్లిపెసర కేజీ పూర్తి ఖరీదు 97రూపాయలు రైతుకట్టవలసినది కేజీ 48.50రూపాయలు, జీలుగ పూర్తి ఖరీదు కేజీ 79రూపాయలు రైతు కట్టవలసినది కేజీ 39.50రూపాయలు అని తెలిపారు
రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకొని నగదు చెల్లించిన వారికి విత్తనాలు రైతు భరోసా కేంద్రం నకు తెప్పించి పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు.
పచ్చి రొట్టె ఎరువులు వలన భూమి గుళ్ళబారి, నేల నీటిని పీల్చుకునే గుణం మెరుగుపడుతుందని, భూమి యొక్క భౌతిక రసాయనిక స్వరూపం మారి, భూసారం వృద్ది చెందుతుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు వై. ప్రభు మరియు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img