జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు…
విశాలాంధ్ర -ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16 తో ప్రజాస్వామ్యంతోఖూనీ అయిందని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడానికి, పవన్ కళ్యాణ్ ని అరెస్టు చేయాలని జీవో నెంబర్ 16ని తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎవరు ప్రశ్నించకూడదని , ఇటువంటి దుశ్చర్యలు చేసినా చూస్తూ ఊరుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ద్యేయం లాగా కనపడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ కి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక వారిని భయపెట్టాలని చూస్తే అరచేతితో సూర్యున్ని ఆపినట్లేనని ఎద్దేవా చేశారు. వాలంటరీ వ్యవస్థలోనే ఉన్న లోపాలను ఎత్తిచూపారు తప్ప, ఎమ్మెల్యేని, నాయకుల్ని పేరు పెట్టి వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదన్నారు. పవన్ కళ్యాణ్ ను బెదిరించాలి, అరెస్టు చేయాలి అనే ఆలోచన తక్షణం విరమించుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ , సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి , మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, నగర కార్యదర్శి సరిధి రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కోఆర్డినటర్ చిత్తిరి శివ, పవన్ అభిమానుల సంఘం అధ్యక్షులు దోస పర్తి రాజు, పైడి లక్ష్మణరావు, బోండా రాము నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.